Breaking News

మందుబాబు ఘాతుకం: ఇంటికి తాళం వేసి నిప్పు.. ఆరుగురు సజీవదహనం


మందుబాబు దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఓ ఇంటికి తాళం వేసి నిప్పటించాడు. ఈ అమానుష ఘటన కర్ణాటకలో శుక్రవారం రాత్రి సంభవించింది. దారుణ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవదహనం కాగా.. మంటల దాటికి మరో ఇద్దరు గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కొడగు జిల్లా విరాజ్‌పేట తాలూకా కనూరు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుంది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆకతాయి చేసిన పనికి ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటికి తాళం వేసి నిప్పంటించడంతో అందులో ఉన్న ఎనిమిది మంది మంటల్లో చిక్కుకున్నారు. ఘటనా స్థలిలోనే ముగ్గురు సజీవదహనం కాగా.. గాయపడినవారిలో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్ది పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటికి నిప్పంటుకున్న విషయం గమనించిన ఇరుగు పొరుగువారు అప్రమత్తమైనా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లోపలి చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే, నిందితుడ్ని త్వరలోనే పట్టుకుంటామని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.


By April 03, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-persons-including-four-children-charred-to-death-in-kodagu/articleshow/81883865.cms

No comments