Breaking News

రోజువారీ కేసుల్లో భారత్ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే నెంబర్ వన్!


దేశంలో కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి దేశంలో క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. దీంతో రోజువారీ కేసుల్లో బ్రెజిల్, అమెరికాలను భారత్ అధిగమించింది. రెండో దశలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అటు, మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,170 కొత్త కేసులు నమోదుకాగా, ఏడు వందలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. దేశంలో ఆరు నెలల తరువాత నమోదయిన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. అలాగే, ఒక్క రోజు ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. దేశంలో యాక్టివ్ కేసులు 6.55 లక్షలు దాటాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, యూపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 47,970 ,ఛత్తీస్‌గఢ్ 4,174 ,పంజాబ్ 2,873, కర్ణాటక 4,991 ,కేరళ 2,508, తమిళనాడు 3,290, గుజరాత్ 2,640, ఢిల్లీ 3,594 ,మధ్యప్రదేశ్ 2,777, రాజస్థాన్ 1,422, ఉత్తర్ ప్రదేశ్ 2,953 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 719 మంది కరోనాకు బలికాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,64,147కి చేరాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాలు, నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు అమలవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. మధ్యప్రదేశ్‌లోని చిండ్వారా సహా నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి చిండ్వారాలో లాక్‌డౌన్ విధించారు. బేతుల్ జిల్లా, ఖార్గోన్ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం 8 గంటల నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్ వరకు తరగతులను నిర్వహించకూడని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అంతిమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ దినేశ్ శర్మ తెలిపారు. కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా ఉన్నత పాఠశాల విభాగం తరగతులు నిర్వహించడం కష్టమనే విషయాన్ని ప్రభుత్వం వద్ద ప్రస్తావించింది.


By April 03, 2021 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-sees-89129-covid-19-cases-and-714-deaths-in-a-day-highest-in-over-6-months/articleshow/81883450.cms

No comments