Breaking News

కాశీ ప్రయాణాలను ఏప్రిల్ 30 వరకు వాయిదా వేసుకోండి.. యూపీ ప్రభుత్వం


ఏదైనా విశేష పరిస్థితిలో తప్ప వారణాసి ప్రయాణాలను భక్తులు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కాశీ విశ్వనాధుడు ఆలయం దర్శనానికి వచ్చే భక్తులు మూడు రోజుల కిందట కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. కాశీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 1,000కిపైగా కొత్త కేసులు నమోదుకావడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. రెండు వారాల్లోనే కోవిడ్ కేసుల 1266 శాతం పెరిగాయి. దీంతో కరోనా కట్టడికి మే 3 వరకు వారాంతపు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు వారణాసి కలెక్టర్ కుశాల్ రాజ్ శర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో కాశీకి వచ్చే దేశీయ, విదేశీ యాత్రికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడాలంటే కోవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని, అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని కలెక్టర్ పేర్కొన్నారు. వారణాసి జిల్లాలో ప్రస్తుతం 10,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లక్నో, ప్రయాగ్ రాజ్ తర్వాత ఇక్కడ అత్యధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. మార్చి 31న కాశీలో 116 కేసులు నిర్ధారణ కాగా.. అప్పటికి 550 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కానీ, గురవారం 1,859 కేసులు నిర్ధారణ అయ్యాయి. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మూడు రోజుల ముందు చెయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ స్పష్టం చేశారు. వారణాసి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భక్తులను గంగా ఘాట్లకు అనుమతించడంలేదు.


By April 16, 2021 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/urged-tourists-to-stay-out-of-the-varnasi-city-in-april-due-to-rising-covid-cases/articleshow/82094468.cms

No comments