Breaking News

ఓటేసి ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా ప్రమాదం.. 20 మంది మృతి


ఓటేయడానికి వెళ్లి బస్సులో వస్తుండగా ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పెరూలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 18 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.00 గంటల ప్రాంతంలో పాలో సెకో వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఉత్తర్ అంకాష్ పరిధిలోని సిహౌస్ ప్రావిన్సుల వద్ద బస్సు బోల్తాపడింది. పరోబాంబా డిస్ట్రిక్ట్ మున్సిపల్ అధికారులు తెలిపిన ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే 18 మంది మృతిచెందారు. చికిత్స కోసం తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఫమా టూర్స్ ఎస్ఏ సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్టు తెలిపారు. ఆదివారం జరిగిన పెరు సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటేయడానికి స్వస్థలాలకు వెళ్లి తిరిగొస్తున్నట్టు స్థానిక రేడియా తెలిపింది. బాధితులు హౌంచయల్లో, పరోబాంబాల నుంచి చింబోటే, లిమాకు వెళ్తున్నట్టు పేర్కొంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించి, గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసంం తరలించారు. ప్రమాదం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన పెరు రవణా శాఖ అధికారులు.. ప్రమాదం జరిగిన తీరు గురించి సమాచారాన్ని సేకరించి, తగిన చర్యలు తీసుకోడానికి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.


By April 13, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-20-dead-in-accident-due-to-bus-skidded-and-overturned-in-peru/articleshow/82043031.cms

No comments