మహారాష్ట్రలో మరో విషాదం: ఐసీయూలో అగ్ని ప్రమాదం.. 13 మంది కోవిడ్ రోగులు సజీవదహనం

నాసిక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం మరువక ముందే మహారాష్ట్రలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ముంబయి సమీపంలోని ఓ సంభవించి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున విరార్లోని విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో సంభవించింది. ఈ ప్రమాదం జరిగే సమయానికి ఆస్పత్రిలో 90 మంది రోగులున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐసీయూలో మంటలు చెలరేగినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తాను ఆస్పత్రికి వచ్చే సమయానికి రెండో అంతస్తులోని ఐసీయూ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయని అవినాష్ పాటిల్ అనే యువకుడు తెలిపాడు. మా స్నేహితుడి అత్త ఈ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుందని, అతడు ఫోన్ చేయడంతో ఇక్కడకు వచ్చానని అన్నాడు. ఆస్పత్రిలో అప్పటికి ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారని, వైద్యులు ఎవరూ లేరన్నారు. అరగంట పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్టు పేర్కొన్నాడు. ఎనిమిది నుంచి 10 వరకు మృతదేహాలను చూశానని ప్రత్యక్ష సాక్షి వివరించాడు. అయితే, వైద్యులు విధుల్లో లేరనే ఆరోపణలను హాస్పిటల్ సీఈఓ విజయ్ వల్లభ్ ఖండించారు. అంతేకాదు, పక్కాగా అగ్ని ప్రమాదాలను నిరోధించే భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. ప్రమాదం తర్వాత పలువురు బాధితులు మరో ఆస్పత్రికి తరలించారు. నాసిక్లోని పురపాలక ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది కొవిడ్ రోగులు మృతిచెందిన విషయం తెలిసిందే.
By April 23, 2021 at 08:30AM
No comments