నాటు బాంబు పేలి ఏడేళ్ల బాలుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
పశ్చిమ బెంగాల్లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బుర్దవాన్ ప్రాంతంలో సోమవారు నాడు భయంకరమైన ఘటన కలకలం రేపింది. నాటు బాంబు పేలి ఓ చిన్నారి మృతి చెందాడు. మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారికి ఒక ప్యాకెట్ కనిపించింది. అదేంటో తెలియని ఆ పిల్లలు దాన్ని బలంగా నేలకేసి కొట్టారు. అంతే ఆ ప్యాకెట్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఎందుకంటే దానిలో నాటు బాంబులు ఉన్నాయి. ధాటికి 7ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 9ఏళ్ల మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పూర్వ వర్ధమాన్ జిల్లా మేజిస్ట్రేట్ను ఎన్నికల సంఘం కోరినట్లు సమాచారం. చిన్నారి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుము కున్నాయి.
By March 23, 2021 at 06:56AM
No comments