Breaking News

నాందేడ్: కోవిడ్ కారణంగా ఊరేగింపునకు నిరాకరణ... పోలీసులపై దాడులు


కోవిడ్ కారణంగా ఊరేగింపునకు అనుమతించని పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతుండటంతో మహమ్మారి నియంత్రణకు ఊరేగింపులు, వేడుకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నాందేడ్ గురుద్వారా వద్ద ‘హోలా మహోల్లా’ ఊరేగింపునకు అనుమతి నిరాకరించిన పోలీసులు... కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించవద్దని సూచించారు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ భారీగా చేరుకున్న కొందరు యువకులు బారికేడ్లను తోసుకుంటూ కత్తులు తిప్పుడూ ఊరేగింపునకు ప్రయత్నించారు. ఈ సందర్బంగా యువకులను అడ్డుకోడానికి ప్రయత్నించి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో నలుగురు పోలీసుల గాయపడగా, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాందేడ్ ఎస్పీ ప్రమోద్ కుమార్ షేవాలా మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభణతో హోలా మోహూల్లాకు అనుమతి నిరాకరించామని తెలిపారు. ‘గురుద్వారా నిర్వహాకులు, పూజారులతోనూ మాట్లాడి పరిస్థితిని వివరించాం.. దీనికి వారు అంగీకరించి గురుద్వారా పరిసరాల్లోనే ఉత్సవాన్ని నిర్వహించుకుంటామని హామీ ఇచ్చారు’అని వివరించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉత్సవాన్ని ప్రారంభించారు.. కానీ, కొంత మంది యువకులు సహనం కోల్పోయి గేట్-1 ద్వారా బయటకు వచ్చారని తెలిపారు. సంప్రదాయ హోలా మహోల్లా ఉత్సవాన్ని నిర్వహించి, సిక్కు మార్షల్ నైపుణ్యాలను ప్రదర్శించారు. గురుద్వారా వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకొస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగి నెట్టుకుంటూ ముందుకెళ్లారు. కొందరు దాడికి దిగడంతో నలుగురు పోలీసులకు గాయలయ్యారు. అక్కడ ఉన్న వాహనాలపై దాడికి పాల్పడటంతో ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి.


By March 30, 2021 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-attacked-as-religious-procession-refused-in-nanded-in-maharashtra-4-injured/articleshow/81754402.cms

No comments