Breaking News

మమతపై దాడి.. ఎన్నికల కమిషన్ నివేదిక ఏం తేల్చిందంటే?


వరుసగా మూడోసారి అధికారం కోసం నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరగలేదని, అది ప్రమాదమని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన నివేదికపై చర్చించిన ఈసీ.. ఇందులో సీఎం భద్రతా సిబ్బంది వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఎన్నికల పేరుతో శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకున్నట్టు టీఎంసీ చేస్తోన్న ఆరోపణలు వాస్తవం కాదని ఈసీ స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ఆదేశాల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయనే ఆరోపణలపై స్పందించడం కూడా అప్రస్తుతమని వ్యాఖ్యానించింది. మమత మాత్రం తనను నలుగురు లేదా ఐదుగురు నెట్టేశారని, ఆ సమయంలో పోలీసులు ఎవరూ నా దగ్గర లేరని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మర్నాడు మమత మాట్లాడుతూ.. ‘నాపై దాడి జరిగింది నిజం.. నేను నిన్న చాలా తీవ్రంగా గాయపడ్డాను.. పాదాలు, లెగ్మెంట్స్‌కు గాయం అయింది నిజం ..గాయం కారణంగా తల, ఛాతీలో నొప్పి వచ్చింది’ అని అన్నారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మమతా బెనర్జీ.. ఆదివారం నుంచి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ..‘కాలు నొప్పి ఇంకా బాధిస్తూనే ఉంది. ప్రజల కష్టాల కంటే ఈ బాధ ఎక్కువేమి కాదు... నిర్భయంగా నా పోరాటం కొనసాగిస్తాను.. కాలు నొప్పి కంటే ప్రజల గురించిన బాధే తనకు ఎక్కువగా ఉంది.. మాతృభూమిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటంలో మనం ఎన్నో బాధలు ఎదుర్కొన్నామని, అయితే ఏరోజూ పిరికివాళ్లలా తలవంచలేదు’ అని అన్నారు. ఆదివారం ఆమె వీల్‌చైర్‌లో కూర్చునే రోడ్‌షోలో పాల్గొన్నారు. తనకు తగిలిన గాయం వల్ల ఎన్నికల పనికి విఘాతం కలుగనీయనని ప్రకటించారు. 294 మంది సభ్యుల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ఈనెల 27న జరుగనుండగా.. ఏప్రిల్ 29తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.


By March 14, 2021 at 03:25PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/west-bengal/news/election-commission-rules-out-attack-on-mamata-banerjee-says-it-was-accident/articleshow/81494387.cms

No comments