Breaking News

కార్తికేయకు సైబరాబాద్ పోలీసుల ఝలక్.. ఏకంగా 'చావు కబురు చల్లగా' పోస్టర్ షేర్ చేస్తూ కౌంటర్!


ట్రాఫిక్ నియమాలు, ప్రజల సేఫ్టీ గురించి వినూత్నంగా ఆలోచిస్తూ జనంలో అవగాహన పెంపొందిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. బైక్ రైడ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలను అర్థమయ్యే విధంగా తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా '' సినిమా పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కార్తికేయకు ఝలక్ ఇచ్చారు. బైక్ డ్రైవ్ చేసే సమయంలో హెల్మెట్ల ఆవశ్యకతను తెలుపుతూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. యంగ్ హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' సినిమా రూపొందింది. డిఫరెంట్ టైటిల్‌లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పోస్టర్‌ని వాడుతూ వినూత్నంగా ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన నెలకొల్పారు సైబరాబాద్ పోలీసులు. పల్సర్ బైక్‌పై దూరం దూరంగా కూర్చొని కార్తికేయ, లావణ్య వెళుతున్న పోస్టర్ ఇందుకోసం వాడారు. ఈ పోస్టర్‌లో హెల్మెట్ లేకుండా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని బైక్ నడిపిస్తూ కనిపించారు. దీంతో ''హెల్మెట్లు పెట్టుకొని, సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు'' అంటూ దీనిపై కౌంటర్ వేసిన సైబరాబాద్ పోలీసులు ఈ ట్వీట్‌ని కార్తికేయతో పాటు లావణ్య త్రిపాఠికి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. గీతా ఆర్ట్స్- 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న ఈ 'చావు కబురు చల్లగా' సినిమా ఈ రోజే (మర్చి 19) ప్రేక్షకుల ముందుకొచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటించగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించారు. సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్ర పోషించింది. అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అయింది.


By March 19, 2021 at 04:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chaavu-kaburu-challaga-cyberabad-police-counters-on-hero-karthikeya/articleshow/81588228.cms

No comments