Breaking News

వాట్సాప్‌కు దూరంగా సుప్రీం.. ఇకపై వాటి ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లింక్‌లు


కోర్టు విచారణలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లింకులను ఇకపై వాట్సాప్‌ గ్రూప్‌లలో పంపరాదని నిర్ణయించింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు రిజిస్ట్రీ శనివారం వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో వర్చువల్‌ కోర్టుల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కేసుల విచారణకు సంబంధించిన సమాచారం కూడా వాట్సాప్‌లోనే షేర్ చేస్తున్నారు. అయితే, ఇక నుంచి రిజిస్టర్డ్‌ ఈ-మెయిల్‌, ధృవీకరించిన మొబైల్‌ నెంబర్‌ ద్వారానే పంపించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. తాజాగా కేంద్రం జారీచేసిన ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు సుప్రీం రిజిస్ట్రీ పేర్కొంది. కోర్టు విచారణకు సంబంధించిన విషయాలు, వాటి వీడియో కాన్ఫరెన్స్ సమాచారాన్ని పంపించేందుకు వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేయడాన్ని నిలిపివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. సోషల్ మీడియా, ఓటీటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మార్చి 1 నుంచి వీడియో కాన్ఫరెన్సుల సమాచారాన్ని రిజిస్ట్రీ సూచించిన వాటి ద్వారానే పంపించాలని స్పష్టంచేసింది. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలు, నేరపూరిత సమాచారాన్ని ప్రసారం చేస్తున్న సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలపై కేంద్రం ఇటీవల కొరడా ఝలిపించింది. తమ వేదికలపై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్‌ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి స్ట్రీమింగ్‌ సంస్థలు అనుసరించాల్సిన నియమావళిని పేరుతో ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు పక్కాగా అమలకు మూడు అంచెల నియంత్రణ విధానాన్ని అనుసరించనునున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా పోస్టును తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే వాటిని పాటించాలి. లేదంటే.. సదరు సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేస్తారు. చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, వీలైనంత త్వరగా కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది.


By March 01, 2021 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-will-no-longer-use-whatsapp-to-share-video-conference-links/articleshow/81266161.cms

No comments