Breaking News

పసుపు రైతుకు కాసుల పంట.. దేశ చరిత్రలోనే రికార్డ్ ధర!


పసుపు సాగు చేస్తున్న రైతులకు గుడ్ న్యూస్. దేశంలో రికార్డ్ స్థాయికి చేరింది. మహారాష్ట్రలోని సంగ్లీ మార్కెట్లో నాణ్యమైన పసుపు క్వింటాల్ ధర రూ.30 వేలు పలికింది. పసుపు ఈ స్థాయిలో ధర పలకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన ఓ రైతు సేలం వంగడానికి చెందిన మూడున్నర క్వింటాళ్ల పసుపును శుద్ధి చేసి సంగ్లీ మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఆయనకు రూ.1.05 లక్షలు వచ్చాయి. కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకం పెరగడం.. ఈ ఏడాది దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో పసుపు ధర అమాంతం పెరుగుతోంది. 2020 జనవరి- డిసెంబర్ మధ్య భారత్ నుంచి 1,81,664 టన్నుల పసుపును విదేశాలకు ఎగుమతయ్యింది. 2021లో ఎగుమతులు మరింత పెరిగి 2.30 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉంది. తమిళనాడు, మహారాష్ట్రల్లో క్వింటాల్ పసుపు సగటు ధర రూ.12-14 వేల మధ్య ఉంటుండగా.. నిజామాబాద్‌లో రూ.10 వేలు దాటింది. నిజామాబాద్ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన పసుపు సాగవుతుంది. కానీ ఇక్కడ ధర అంతంత మాత్రంగానే ఉంటుండటంతో.. రైతులు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో తమ పంటను విక్రయిస్తున్నారు.


By March 03, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-farmer-sold-quintal-turmeric-for-rs-30000-in-sangli-market/articleshow/81302992.cms

No comments