కమల్ హాసన్ వాహనంపై దాడి.. తృటిలో తప్పించుకున్న నటుడు

అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ కారుపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసినట్టు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కాంచీపురంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దాడిలో కమల్ హాసన్కు ఎటువంటి గాయాలు కాలేదని, కారు అద్దం మాత్రం ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కాంచీపురంలో ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత చెన్నైకు తిరుగు ప్రయాణమవుతుండగా గుర్తుతెలియని ఓ వ్యక్తి దాడిచేసినట్టు ఆ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ ఏజీ మౌర్య ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్పై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించామని వివరించారు. ఇటువంటి చర్యలకు తమ పార్టీ భయపడిపోదని స్పష్టం చేశారు. నిందితుడి ఫోటోలను ప్రచారం చేసిన స్థానిక మీడియా, అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. దీనిపై తక్షణమే స్పందించడానికి పోలీస్ అధికారులు నిరాకరించారు. కారుపై దాడికి ప్రయత్నించిన యువకుడు మద్యం సేవించి ఉన్నట్టు భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడిని పట్టుకుని ఎంఎన్ఎం కార్యకర్తలు, నేతలు కొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. కాగా, తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతున్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కమల్ ఢీకొట్టబోతున్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరనుంది. ఫలితాలు మే 2న వెల్లడికానున్నాయి. అధికార అన్నాడీఎంకే-బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వరుసగా మూడోసారి అధికారం కోసం అన్నాడీఎం, పదేళ్లు అధికారానికి దూరమైన డీఎంకే ప్రజాకర్షక హామీలు గుప్పిస్తున్నాయి.
By March 15, 2021 at 08:52AM
No comments