Breaking News

దేశంలో రికార్డ్‌స్థాయిలో కోవిడ్ కేసులు, మరణాలు.. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం


దేశంలో మరోసారి మహమ్మారి ఉద్ధృతమవుతోంది. గత 15 రోజుల నుంచి క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పాజిటివ్ కేసులు 23వేలకుపైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,845 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే మరో 140 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1,13,33,491కు చేరుకోగా.. ఇప్పటి వరకు 109,71,347 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 158,483కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు దాదాపు రెండు లక్షలు ఉండగా.. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకుపైగా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులోనే 85 శాతానికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రికార్డుస్థాయిలో కొత్త కేసులు నమోదుకావడం కలవరానికి గురిచేస్తోంది. శుక్రవారం మహారాష్ట్రలో దాదాపు 16 వేల కేసులు బయటపడ్డాయి. ఒక్క ముంబై నగరంలోనే 1,646 మంది వైరస్ బారిపడ్డారు. అక్కడ మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో ఒక్క రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 5,42,693 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉండగా, 4,884 మంది కరోనా సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. తాజాగా 11 వేల 344 మంది కరోనా నుంచి విముక్తిపొంది ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.79గా ఉంది. డెత్ రేటు 2.31గా ఉంది. ఇదేవిధంగా దేశరాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొత్తగా 600కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో గడిచిన 20 రోజులతో పోల్చితే కొవిడ్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 833 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులోనే 526 మంది ఉన్నారు. దీంతో 9.58 లక్షల మంది కొవిడ్‌ బాధితులయ్యారు. తమిళనాడులో 670 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,58,272కు పెరిగింది. చెన్నైలో 265 మందికి పాజిటివ్‌‌గా నిర్దారణ అయ్యింది. ఏపీలోనూ 200కిపైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.


By March 13, 2021 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-24845-fresh-coronavirus-cases-highest-this-year/articleshow/81478826.cms

No comments