Breaking News

ఎయిమ్స్‌లో కోవిడ్ టీకా తీసుకున్న మోదీ.. కొవాగ్జిన్ తొలి డోస్ ఇచ్చిన సిస్టర్ నివేదా


కరోనా వైరస్ టీకాను తీసుకున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సిబ్బంది సోమవారం ఉదయం ప్రధానికి తొలి డోస్ వేశారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాను ప్రధాని వేయించుకున్నారు. ఎయిమ్స్‌లో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ పి. నివేదా ప్రధానికి టీకాను సిరంజ్ ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి, సేవలను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. తాను టీకా తీసుకున్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘కోవిడ్-19పై పోరాటంలో వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి, సేవలను అభినందనీయం... కరోనాపై పోరు బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తున్నారు... అర్హులైన వ్యక్తులందరూ కరోనా టీకాను వేయించుకుని, కోవిడ్ రహిత భారత్‌ను రూపొదిద్దాం’ అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో కోవిడ్ టీకా మూడో దశ ప్రక్రియ సోమవారం (మార్చి 1న) ప్రారంభం కానుండగా.. ప్రధాని టీకా వేయించుకున్నారు. తొలి దశలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా కరోనా టీకాలు అందజేసిన విషయం తెలిసిందే. మూడో దశలో 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు పైబడి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి టీకాలు వేయడానికి నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కొవిన్ (Co-Win) పోర్టల్‌లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఆరోగ్యసేతు లాంటి యాప్‌లను కూడా ఇందుకోసం వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్లాట్ బుకింగ్ ప్రక్రియ రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అంతకు ముందే అందుబాటును బట్టి అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకోవచ్చు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో టీకా కోసం సిటిజన్ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్‌కు సంబంధించి ఓ యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచారు.


By March 01, 2021 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-takes-first-dose-of-bharat-biotech-covid-vaccine/articleshow/81265643.cms

No comments