Breaking News

8ఏళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య.. సహచరుడికి మరణశిక్ష విధించిన ఉగ్రవాదులు!


మాజీ మంత్రి ఎనిమిదేళ్ల కుమార్తె కిడ్నాప్, హత్య కేసులో అరెస్టయిన ఉగ్రవాది జైలు నుంచి తప్పించుకుని, అనూహ్యంగా సహచరుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. మణిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్‌లో పురాతన ఉగ్రవాద సంస్థ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ () ప్రస్తుతం అంతర్గత సంక్షోభంతో కొట్టిమిట్టాడుతోంది. హత్య కేసు విచారణలో ఉండగా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది తోకోచోమ్ నండో సింగ్‌ ఇటీవల జైలు నుంచి తప్పించుకున్నాడు. తోకోచోమ్ నండో సింగ్ అలియాస్ కేసీపీ నండో అలియాస్ మన్‌గ్యాంగ్‌‌ను గుర్తుతెలియని ప్రదేశంలో యూఎన్ఎల్ఎఫ్‌లోని ఓ వర్గం మరణశిక్ష విధించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. అంతేకాదు, అమాయకురాలైన 8 ఏళ్ల చిన్నారిని అత్యంత క్రూరంగా, అమానవీయంగాపై పొట్టనబెట్టుకున్న నండోకు మరణశిక్ష విధించామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది 2021లో రాష్ట్రంలోని మహిళావర్గానికి తాము అందజేసిన కానుక అని ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకంగా నండోను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సోమవారం అతడిని గుర్తించడంలో విజయవంతమైందని, ఆ మర్నాడు సాయంత్రం విచారణ తర్వాత అతడికి మరణశిక్ష విధించామని సాయుధ బృందం తెలిపింది. మాజీ మంత్రి కుమార్తె ఎనిమిదేళ్ల బాలికను 2003 నవంబరు 3న చిన్నారి చదువుతున్న పాఠశాల గేట్ వద్ద అపహరించారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఓ గొనె సంచిలో పోలీసులు గుర్తించారు.


By March 04, 2021 at 07:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/terrorist-killed-by-militants-for-murder-of-8-year-old-in-manipur/articleshow/81322116.cms

No comments