Breaking News

తమిళనాడు: 60 సీట్ల కావాలంటున్న బీజేపీ.. ససేమిరా అంటోన్న అన్నాడీఎంకే


తమిళనాడులో అన్నాడీఎంకే, మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరాలేదు. ఈ కూటమిలోని పీఎంకేకి 23 సీట్లను కేటాయించగా, బీజేపీకి త్వరలో కేటాయిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయమై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వంతో కేంద్ర హోం మంత్రి ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన వరకూ ఈ భేటీ కొనసాగింది. అయితే, ఇరు వర్గాలు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అంతకు ముందు శనివారం ఈపీఎస్, ఓపీఎస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురగన్, తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగినట్టు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తాము ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నామో ఆ వివరాలను బీజేపీ నేతలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీకి 21 సీట్లు ఇస్తామని అన్నాడీఎంకే స్పష్టం చేసినట్టు పేర్కొన్నాయి. ‘ఇరు పార్టీల మధ్య సోమవారం రాత్రి జరగబోయే చర్చలతో ఓ కొలిక్కి వస్తారని, మిగతా భాగస్వామ్య పార్టీలతో ఆలోచించిన అన్నాడీఎంకే నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని పేర్కొన్నాయి. అయితే, బీజేపీ 60 స్థానాలు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పొందిన స్థానాలను తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. మరోవైపు, అన్నాడీఎంకే మాత్రం 170 నుంచి 180 సీట్లలో పోటీకి సిద్దమయ్యింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తోంది. అన్నాడీఎంకే తమ పార్టీ బలాన్ని తక్కువగా చూస్తోందని, గత కొన్నేళ్లుగా తమిళనాడులో గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకున్నామని బీజేపీ అంటోంది. ఇదిలా ఉండగా, డీఎండీకేతోనూ జట్టుకట్టేందుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్‌కాంత్‌తో శనివార రాత్రి మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి సమావేశమయ్యారు.


By March 01, 2021 at 02:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-elections-bjp-takes-60-constituency-list-to-aiadmk-may-get-21/articleshow/81271187.cms

No comments