Breaking News

మహారాష్ట్రలో ఒక్క రోజే 23,179 కేసులు, 84 మరణాలు


హారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. బుధవారం (మార్చి 17) ఆ రాష్ట్రంలో కొత్తగా 23,179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో మరో 84 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కొవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 53,080కు చేరింది. కరోనా కేసుల సంఖ్య 23,70,507కు ఎగబాకింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,52,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం కొవిడ్-19 నుంచి కోలుకొని 9,138 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆ రాష్ట్రలో ఇప్పటివరకు 21,63,391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్‌కు ప్రారంభ దశలో ఉన్నట్లు కేంద్ర అధికారుల బృందం పేర్కొంది. వైరస్ ప్రభావం ఉన్న జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని మహారాష్ట్ర సర్కార్‌కు సూచించింది. ఇంకా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కమ్యూనిటీ ట్రాన్స్‌ఫర్ ఎక్కువగా ఉందని పేర్కొంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలోని 16 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి 15 రోజుల్లో 150 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 60 శాతం కేసులు మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. ముంబైతో పాటు ఔరంగాబాద్, పర్భాని, అమరావతి, పుణే, నాగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.


By March 17, 2021 at 11:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-reports-23179-covid-19-cases-84-deaths-on-march-17/articleshow/81555608.cms

No comments