Breaking News

Budget 2021: ఎన్నికలున్న ఆ రాష్ట్రాలకు భారీ కేటాయింపులు


త్వరలో ఎన్నికలు జరుగననున్న రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్-2021లో భారీగా తాయిలాలు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, , కేరళ, అసోం రాష్ట్రాల్లో రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. త‌మిళ‌నాడులో 3500 కిలోమీట‌ర్ల మేర‌ జాతీయ హైవేల నిర్మాణ ప‌నులు చేప‌ట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. ఇందు కోసం రూ.1.03 ల‌క్షల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేర‌ళ‌లో 1100 కిలోమీట‌ర్ల రహదారుల నిర్మాణ ప‌నుల కోసం రూ.65 వేల కోట్లు కేటాయించారు. ఇక ప‌శ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణం కోసం రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బెంగాల్‌లో 675 కిలోమీట‌ర్ల మేర హైవేల నిర్మాణ ప‌నులు చేప‌ట్టనున్నట్లు తెలిపారు. వీటిలో కోల్‌కతా - సిలిగురి హైవే కారిడార్ ఉంది. త‌మిళ‌నాడులో రెండు హైవే కారిడార్లను నిర్మించ‌నున్నట్టు తెలిపారు. ఆ ప‌నులు వ‌చ్చే ఏడాది ప్రారంభం అవుతాయని చెప్పారు. అసోంలో రూ. 19 వేల కోట్ల విలువైన రహదారుల నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నట్లు తెలిపారు. బడ్జెట్ -2021లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ‌కు పెద్ద పీట వేసినట్లు నిర్మలా సీతారామ‌న్ తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆ శాఖకు ల‌క్షా 80 వేల కోట్ల రూపాయలను కేటాయించిన‌ట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 11 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రజా రవాణాకు 2021-22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రోడ్డు రవాణా, రహదారులకు రూ 1.18 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో పాటు రైల్వే ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.


By February 01, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fm-sitharaman-announces-highway-bonanza-in-poll-bound-states-bengal-tamil-nadu-kerala-and-assam/articleshow/80626668.cms

No comments