Breaking News

రైతుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. టెండూల్కర్‌కు పవార్ చురకలు!


సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. శాంతియుతంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. రైతులకు మద్దతుగా ప్రముఖ పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌లు చేసిన ట్వీట్లను దేశంలోని ప్రముఖులు తప్పుబడుతూ కేంద్రానికి బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. వీరిలో క్రికెటర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈ అంశంపై ఎన్‌సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నేత స్పందిస్తూ టెండూల్కర్‌కు చురకలంటించారు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని పవార్‌ సూచించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా, ఖలీస్థానీలుగా కేంద్రం అభివర్ణిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ఈ ఆందోళనకారులంతా దేశానికి అన్నం పెట్టే రైతన్నలు. వారిని ఉగ్రవాదులు, ఖలీస్థానీలుగా ముద్ర వేసే హక్కు లేదు’ అని హితవు పలికారు. ‘చాలా మంది వేగంగా స్పందిస్తూ మద్దతుగా నిలిచారు (భారతీయ ప్రముఖులు).. నేను సచిన్‌కు ఇచ్చే సలహా ఒకటే ఇతర రంగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. పవార్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి విమర్శలు గుప్పించారు. ‘ఆయన సలహా మియా ఖలీఫా, రిహన్నా, గ్రెటా థన్‌బెర్గ్‌లకు అందుబాటులో ఉందని నేను ఎలా భావిస్తున్నాను.. వ్యవసాయ శాఖకు గతంలో మంత్రిగా ఉన్నందున, ఏపీఎంసీలతో కలిసి పనిచేశారు.. సంస్కరణలకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు కాబట్టి పవార్ తెలుసుకోవడం గురించి ఇంకా నేను మాట్లాడటం లేదు’ అంటూ ట్విట్టర్‌లో స్పందించారు. గతంలో వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా పవార్ ఇచ్చిన లేఖలను విడుదల చేసిన బీజేపీ.. ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టింది.


By February 07, 2021 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ncp-leader-sharad-pawar-advice-to-sachin-tendulkar-on-indians-for-india-tweet/articleshow/80730826.cms

No comments