Breaking News

గల్వాన్ ఘర్షణ వీడియో విడుదల చేసిన చైనా.. మరో కుట్రకు తెర!


సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద గతేడాది జూన్‌ 15న భారత్‌ సైన్యంతో జరిగిన ఘర్షణలో తమ సైనికులు ఐదుగురు చనిపోయినట్టు చైనా ఎనిమిది నెలల తర్వాత వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను చైనా తాజాగా విడుదల చేసింది. సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు క్రమంగా వీడుతున్న వేళ డ్రాగన్ ఈ వివరాలను విడుదల చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గల్వాన్ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ట్విట్టర్‌లో షేర్ చేసింది. తొలుత భారత సైన్యమే తమ భూభాగంలోకి దూసుకొచ్చిందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య వాగ్వాదం జరిగినట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘర్షణలో నలుగురు చైనా సైనికులు అమరులయ్యారని, వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే, ఇదే ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. దాదాపు 30 మందికిపైగా చైనా సైనికులు ఈ ఘటనలో మరణించినట్లు భారత్ సైన్యం చెబుతుండగా.. కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు చైనా ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా, సరిహద్దుల్లో ఇరు దేశాలూ దేశాలూ సైన్యాలను ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించిన వేళ చైనా మీడియా మరో కుట్రకు తెరతీసిందనేది స్పష్టంగా అర్ధమవుతోంది. చీకటి పడుతుండగా చలిలోనూ ఇరు దేశాలకు చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో గల్వాన్ వద్ద ఓ నదిని దాటి ఒడ్డున ఉన్న కొండ వద్ద కలిశారు.. ఇదే సమయంలో ఒకరినొకరు నెట్టుకుంటున్నట్టు వీడియోలో కనబడుతోంది. చీకటి వేళ ఇరు దేశాల సైనికులు కొండ అంచున నిలబడి ఫ్లాష్ లైట్లు, లాఠీలు పట్టుకుని పెద్దగా అరుస్తున్నారు. 1962 భారత్-చైనా యుద్ధంలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భారత సైనికులు తమ సాంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్ వరకు కవాతు చేయకుండా సీపీఎల్ఏ అడ్డుకోవడంతో గల్వాన్ లోయలో ఘర్షణకు దారితీసింది.


By February 20, 2021 at 07:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-releases-galwan-clashes-video-shows-confrontation-with-indian-troops/articleshow/81120397.cms

No comments