Breaking News

పళని సర్కారు సంచలన నిర్ణయం.. శశికళకు ఊహంచని షాక్


అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తికావడంతో జనవరి 27న విడుదలైన జయలలిత నెచ్చెలి .. రెండు రోజుల కిందట తమిళనాడుకు చేరుకున్న విషయం తెలిసిందే. స్వరాష్ట్రంలో శశికళకు అడుగడుగునా ఆమె అభిమానులు నీరాజనాలు పలికారు. దారి పొడువునా సన్మానాలు, సత్కారాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, శశికళకు తమిళనాడు ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తిరువల్లూర్ జిల్లాలో ఆమె బంధువులకు చెందిన 41.2 ఎకరాల భూమిని జప్తు చేసింది. శశికళ బంధువులు ఇళవరసి, వీఎన్ సుధాకర్‌కు చెందిన భూములను స్వాధీనం చేసుకుంది. కొద్ది రోజుల కిందటే చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం సహా తమిళనాడులోని పలు జిల్లాల్లోని భూములను జప్తు చేసింది. మీడియాకు తిరువల్లూరు కలెక్టర్ పి పొన్నయ్య విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి ఉత్తుకొట్టయ్ తాలూకా వెలకాపూరం గ్రామంలోని ఓ ఆగ్రో ఫామ్‌కు చెందిన భూములను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆగ్రో ఫామ్‌‌కు సుధాకరన్, ఇళవరసి భాగస్వాములుగా ఉన్నట్టు తెలిపారు. ఈ భూమి ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిందని కలెక్టర్ ప్రకటించారు. దీని నుంచి వచ్చిన ఆదాయం ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని అమ్మకు నేనే వారసురాలినని ప్రకటించిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు, బుధవారం కృష్ణగిరి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ ఎన్ని అవతారాలెత్తినా అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోలేరని అన్నారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించిన వ్యక్తులు పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. కొందరు ప్రణాళిక వేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా శశికళపై విమర్శలు గుప్పించారు.


By February 11, 2021 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-government-confiscates-vk-sasikala-relatives-land/articleshow/80821500.cms

No comments