Breaking News

కథ వినగానే ఓకే చెప్పా.. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా: నితిన్


'భీష్మ' తర్వాత వరుస సినిమాలను లైన్‌‌లో పెట్టిన లేటెస్ట్ మూవీ ''. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. నితిన్ సరసన రకుల్ ‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్‌ గేమ్‌ టాలెంట్‌తో తన లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడు అనే ఆసక్తికర పాయింట్ తీసుకొని ఈ సినిమా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేశాయి. నితిన్‌ని డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూసేందుకు కుతూహలంగా ఉన్నారు ప్రేక్షకులు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో 'చెక్' కథ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నితిన్. రెండేళ్ల క్రితం ఓ డిఫరెంట్ సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు ఈ కథ వినిపించారని, కథ విన్న 20 నిమిషాల్లోనే ఓకే చెప్పేశానని నితిన్ అన్నారు. తన కెరీర్‌లో ఇలాంటి విభిన్నమైన కథతో సినిమా చేయడం ఇదే తొలిసారి అని చెప్పిన ఆయన.. సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డానని తెలిపారు. నా గత సినిమాలు ఒకెత్తయితే ఈ చిత్రం మరో ఎత్తు అని చెప్పారు. కల్యాణీ మాలిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మేజర్ ప్లస్ అవుతుందని, రకుల్ సహా నటీనటులంతా బాగా యాక్ట్ చేశారని నితిన్ చెప్పారు.


By February 19, 2021 at 10:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiin-reacts-on-his-check-movie-story/articleshow/81103188.cms

No comments