Breaking News

రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’.. ప్రచార సంబరాలు షురూ..!


యూత్ స్టార్ నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘రంగ్ దే’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. గత నాలుగు రోజులుగా ఓ పాటకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 26 నుంచి థియేటర్లలో ‘రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి ‘రంగ్ దే’ను తీర్చిదిద్దారని తెలిపారు. నితిన్, కీర్తి సురేష్ జంట వెండితెరపై కనువిందు చేయనుందన్నారు. ఇటీవల ‘రంగ్ దే’ సినిమా నుంచి విడుదలైన వీడియో, అలాగే ఒక పాటకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ‘రంగ్ దే’కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ కెమెరా స్కిల్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఈ చిత్రంలో తారాగణం కూడా భారీగానే ఉంది. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించారు. కాగా, షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా కీర్తి సురేష్ ట్వీట్ చేశారు. ‘రంగ్ దే’ టీమ్‌ను తాను చాలా మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. ఒక జిఫ్ ఇమేజ్‌ను కూడా షేర్ చేశారు.


By February 24, 2021 at 01:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiin-keerthy-suresh-starrer-rang-de-completes-shoot-all-set-to-release-on-26th-march/articleshow/81187010.cms

No comments