Breaking News

అమ్మకు నేనే వారసురాలిని.. ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నా: శశికళ సంచలన ప్రకటన


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో జనవరి 27న విడుదలైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి సోమవారం తమిళనాడుకు చేరుకున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరిన ఆమెకు దారిపొడువునా అభిమానులు నీరాజనాలు పట్టారు. చైన్నైకు చేరుకునే క్రమంలో అక్కడక్కడా ఆమె మీడియాతో మాట్లాడారు. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. అమ్మకు తానే నిజమైన వారుసురాలినని సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని కోట్లాది మంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. చెన్నైకు చేరే క్రమంలో దారిపొడవునా 66 చోట్ల ‘అమ్మ మక్కల్‌ మున్నేత్ర కళగం’ పార్టీ ప్రముఖులు, కార్యకర్తల స్వాగత సత్కరాలను అందుకున్నారు. శశికళ మేనల్లుడు నాయకుడు దినకరన్‌ నాయకత్వంలో 30 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. తాను పార్టీ జెండాను ఉపయోగించడంపై మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో తన రాకవల్ల కలుగుతున్న భయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన రాకతో సీఎం, మంత్రుల్లో వణుకు ప్రారంభమైందన్నారు. నన్ను అణచివేయాలకుంటే కేవలం అది ప్రేమతోనే సాధ్యం తప్పితే అధికార బలంతో సాధ్యంకాదన్నారు. అందరం ఒక్కటై... ప్రత్యర్థిని ఎదుర్కొని అధికారంలోకి వచ్చి అమ్మ, ఎంజీఆర్‌ ఆశయాలను నిలబెడతామని చెప్పారు. బెంగళూరు నుంచి బయలు దేరిన తర్వాత దాదాపు 20 గంటలపాటు ప్రయాణించిన ‘చిన్నమ్మ’ అర్ధరాత్రి దాటాక చెన్నై చేరుకున్నారు. ప్రభుత్వం ఎత్తులను చిత్తు చేసేలా దినకరన్‌ వ్యవహరించి శశికళకు స్వాగత ఏర్పాట్లను విజయవంతం చేశారు. అన్నాడీఎంకేలో గుబులు పుట్టించేలా చిన్నమ్మ ప్రయాణం సాగింది. రాత్రి అవుతున్న కొద్దీ ట్రాఫిక్‌ తగ్గడంతో రోడ్లు జనసందోహాన్ని తలపించాయి. రాత్రి 10.30 గంటల తర్వాత 34 ప్రాంతాల్లో కార్యకర్తల నుంచి శశికళ ఘనస్వాగతాన్ని అందుకున్నారు. 11.30 గంటలకు రాణిపేట నుంచి కాంచీపురం బయలుదేరింది. 12 గంటల ప్రాంతంలో కాంచీపురంలోకి ప్రవేశించారు. మంగళవారం ఉదయం ఆమె ఎంజీఆర్‌ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించనున్నట్లు సమాచారం.


By February 09, 2021 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-aiadmk-general-secretary-vk-sasikala-promised-would-be-returning-to-active-politics/articleshow/80758195.cms

No comments