Breaking News

‘ఉప్పెన’ డైరెక్టర్ పుట్టినరోజు.. రూ.50 కోట్ల బహుమతి!


‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 15). ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుకు ఇచ్చిన బహుమతి గురించి కూడా ఈ ట్వీట్‌లో వెల్లడించారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ‘ఉప్పెన’ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. ఇంత కన్నా గొప్ప పుట్టినరోజు బహుమతి బుచ్చిబాబుకు ఏముంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా పరిచయం అయిన ‘ఉప్పెన’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమానే అయినా ‘ఉప్పెన’కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి కారణం కేవలం మెగా ఇమేజ్ మాత్రమే కాదు.. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఉన్న గుర్తింపు, డైరెక్టర్ సుకుమార్‌కు ఉన్న ఇమేజ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. వీటికి తోడు ప్రచారం కూడా భారీగా కల్పించారు. సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశారు. తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిసింది. తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనితో డిస్ట్రిబ్యూటర్ల షేర్ విలువ రూ.28.29 కోట్లు. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ పాయింట్‌ను దాటేసి విడుదలైన అన్ని ప్రాంతాల్లో లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు సుకుమార్ చెప్పినట్టు రూ.100 కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది. తొలి సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇమేజ్‌ను దక్కించుకున్నారు. మరోవైపు, తొలి చిత్రంతోనే అత్యధిక షేర్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించారు.


By February 15, 2021 at 02:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mythri-movie-makers-rs-50-crore-blockbuster-weekend-birthday-gift-to-uppena-director-buchi-babu-sana/articleshow/80922098.cms

No comments