Breaking News

పోలియో చుక్కలకు బదులు శానిటైజర్.. 12మంది చిన్నారులకు అస్వస్థత


ఆదివారం దేశ వ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం జరిగింది. పలుచోట్ల కొన్ని ఆందోళనకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో పల్స్ పోలియో సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలోఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. అయితే పోలియో డ్రాప్స్ వేసిన కాసేపటికే చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యావత్మాల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసిన సమయంలో పీహెచ్‌సీ డాక్టర్, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వలంటీర్ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు. వైద్య సిబ్బంది ముగ్గుర్నీ కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు.


By February 02, 2021 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kids-administered-sanitiser-drops-instead-of-polio-dose-in-maharashtra-village/articleshow/80642624.cms

No comments