Breaking News

వంద రోజుల్లో కోటి మందికి టీకా.. బైడెన్ కోవిడ్ రెస్క్యూ ప్లాన్ ఇదే


అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌.. జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండగా... బైడైన్ కీలక ప్రతిపాదన చేశారు. అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరిట బాధ్యతలు చేపట్టిన వందరోజుల్లోగా కోటి మందికి టీకాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్రణాళిక ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం సహా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. ‘మేము సమయానికి వ్యతిరేకంగా రేస్ ప్రారంభించే సమయం వచ్చింది.. అదనపు ప్రభుత్వ సహాయం లేకపోవడంతో ఆర్థిక, ప్రజారోగ్య సంక్షోభాలు రాబోయే నెలల్లో తీవ్రమవుతాయి.. పాఠశాలలు సురక్షితంగా తిరిగి తెరవబడవు.. టీకా ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది’ అని బైడెన్ తన ప్రణాళికలో స్పష్టం చేశారు. దీనిపై డెమొక్రాట్ సెనేటర్ చుక్ స్చుమేర్, స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ.. ‘అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ రెస్క్యూ ప్లాన్‌ను రెండు సభల్లో ఆమోదించి చట్టంగా తీసుకొచ్చి పని చేసే హక్కును పొందుతాం’ అని సంయుక్తంగా ప్రకటించారు. కానీ, ఇది తొలి దశ మాత్రమే, బైడెన్ బుధవారం తన బాధ్యతలు చేపట్టిన రెండో రెస్క్యూ ప్లాన్‌ను చట్టసభ సభ్యులకు సమర్పించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు ట్రంప్‌పై అభిశంసన తీర్మానంపై జనవరి 20న సెనెట్‌లో చర్చ జరగనుంది. అదే రోజు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణం చేయనున్నారు. అమెరికాలో నిరుద్యోగం మరింత పెరిగినట్టు గురువారం నాటి ప్రభుత్వ నివేదిక పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ... కరోనా వైరస్ రిలీఫ్ అండ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీ బిల్లుపై డిసెంబరులోనే సంతకం చేశారు. అంతకు ముదు ఈ బిల్లును తాను తిరస్కరిస్తానని ట్రంప్ ప్రకటించడంతో అమెరికావ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చెందారు. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే... అమెరికాలో నిరుద్యోగ సమస్య కుంపట్లు రాజేసేది. ట్రంప్ సంతకం పెట్టకపోయి ఉంటే 1.40 కోట్ల మంది నిరుద్యోగ బీమా కోల్పోయేవారు. ట్రంప్ ఆమోదంతో వల్ల మార్చి వరకూ... ఉద్యోగాలు లేకపోయినా... ప్రతి వారం నిరుద్యోగ భృతి పొందుతారు. మరోవైపు, జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనంలో అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్దఎత్తున్న క్యాపిటల్‌ భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ట్రంప్‌ మద్దతుదారులకు జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.


By January 15, 2021 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-elect-joe-biden-unveils-1-9-trillion-economic-plan-as-us-recovery-buckles/articleshow/80279329.cms

No comments