Breaking News

మంగళసూత్రం కోసమే నీచం.. మూసాపేట కేసులో నిందితుడి అరెస్ట్


హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం కలిగించిన వివాహితపై అత్యాచారం, హత్యాయత్నం ఘటనలో నిందితుడు రాము నేరాన్ని అంగీకరించాడు. మూసాపేటకు చెందిన బాధితురాలు (50) కొంతకాలం క్రితం భర్తతో విడిపోయి తల్లితో కలిసి ఉంటోంది. ఈనెల 25న పని పూర్తి చేసుకుని వెళ్తున్న ఆమెను ఇంటి వద్ద దించుతానంటూ యాదవబస్తీకి చెందిన సెంట్రింగ్‌ మేస్త్రీ రాము రామకృష్ణ (32) బైక్ ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపిన రాము మంగళసూత్రం ఇవ్వాలంటూ మహిళను బెదిరించాడు. Also Read: ఆమె నిరాకరించడంతో అత్యాచారం చేసి బండరాయితో ఆమె తలపై మోదాడు. ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం రామును అరెస్ట్ చేశారు. ఈ కేసులో వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ బి.సురేందర్‌రావు, సీఐ నర్సింగరావు మీడియాకు వెల్లడించారు. నిందితుడు రామును రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


By January 01, 2021 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/moosapet-woman-raped-and-attackec-case-accused-arrested/articleshow/80055623.cms

No comments