Breaking News

కొత్త సాగు చట్టాలను ఏడాదిన్నర నిలిపివేస్తాం.. కేంద్రం సంచలన ప్రతిపాదన


సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య బుధవారం జరిగిన పదో దఫా చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో లేవనెత్తుతున్న అంశాలపై చర్చించేందుకు ఓ కమిటీకి ఒప్పుకుంటే ఏడాదిన్నర పాటు వీటి అమలును నిలిపివేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. సాగు చట్టాలపై స్టే విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్రం.. స్వయంగా ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. కానీ, కేంద్రం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు కేంద్రం ఆలోచనను ప్రతిబింబిస్తాయి. ఈ చట్టాల విషయంలో నెలకున్న ప్రతిష్ఠంభన, సుప్రీంకోర్టు స్టేను అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. రైతు సంఘాలు వెనక్కి తగ్గవని చెప్పడానికి కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయవచ్చని తోమర్ చెప్పినప్పటికీ, అన్నదాతలు ఈ ప్రతిపాదనపై గురువారం చర్చించి, జనవరి 22న తిరిగి చర్చలకు వస్తామని తెలిపాయి. అయితే, చట్టాలను రద్దుచేయబోమని, కేవలం వాటి అమలును తాత్కాలికంగా నిలిపివేస్తామని వ్యవసాయ మంత్రి పునరుద్ఘాటించారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ జయంతి ఎంతో పవిత్రమైన రోజని, ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్రం మధ్య చర్చలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘మేం అర్ధరాత్రి వరకు కూర్చుని చర్చలు జరపవచ్చు.. కానీ, పవిత్రమైన ఈ రోజున పరిష్కార మార్గం కనుగొనాలి’అని అన్నారు. వాస్తవానికి పదో విడత చర్చలు మంగళవారం జరగాల్సి ఉండగా.. వాటిని బుధవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు తాము హాజరుకాబోమని రైతు సంఘాలు స్పష్టం చేసినప్పటికీ గురువారం మూడు దఫాలు సమావేశాలు నిర్వహించనున్నాయి. చట్టాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానల్‌కు సమాంతరంగా తాము ప్రతిపాదించిన కమిటీ ముందుకు సాగవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రైతు సంఘాల నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. ‘కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా చట్టాలను ఏడాదిన్నర వరకు నిలిపివేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మేము దీనిని అంగీకరించడానికి నిరాకరించాం.. కానీ, 450 వ్యవసాయ సంఘాలతో మోర్చాలో ఈ ప్రతిపాదన గురించి చర్చిస్తామని మంత్రులకు హామీ ఇచ్చాం... అప్పటి వరకు, జనవరి 26 న కవాతుతో సహా మా నిరసన ప్రతిపాదనలన్నీ చర్చించనున్నాం’ అని తెలిపారు. ప్రముఖ రైతు సంఘాల నేతలు దర్శన్ పాల్, జగ్జీత్ సింగ్ దాలేవాల్ మాట్లాడుతూ.. సాగు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దుచేయబోమని, వాటిపై సవరణలకు సిద్ధంగా ఉన్నామని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు.. ఓ చిన్న కమిటీని వేసి ఆ నివేదిక వచ్చే వరకూ సాగుచట్టాల అమలును నిలిపివేస్తాం’ అన్నారని పేర్కొన్నారు.


By January 21, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-offers-to-suspend-agri-laws-for-18-months-in-10th-time-talks/articleshow/80377624.cms

No comments