Breaking News

నాలుగేళ్ల కిందట ప్రేమ పెళ్లి.. రైలు కిందపడి భర్త ఆత్మహత్య, 24 గంటల తర్వాత భార్య..


పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట కథ చివరకు విషాదాంతమయ్యింది. భర్త ఆత్మహత్యకు పాల్పడిన 24 గంటల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శివపురి పరిధిలోని తరనా ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో కిరణ్ (25) బుధవారం ట్రక్కు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఒక రోజు ముందే అంటే మంగళవారమే అఖిలేష్ చౌహన్ (29) రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కిరణ్‌, అఖిలేష్‌లు నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అఖిలేష్ మంగళవారం రాత్రి బలియా పరిధిలోని చిత్‌బడ్‌గావ్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కిరణ్ కూడా ఓవర్‌బ్రిడ్జి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ధైర్యం సరిపోకపోవడంతో ట్రక్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. వివాహం తర్వాత ఢిల్లీలో కొన్నాళ్లు ఉన్న ఈ జంట, తరువాత శివపుర్‌ పరిధి తరానాకు వచ్చారు. వివాహం చేసుకున్న దగ్గర నుంచి అఖిలేష్ తన తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. అఖిలేష్ జేబులో లభించిన డైరీ ఆధారంగా అతడు ఎవరనేది పోలీసులు గుర్తించారు. ఇందులో సూసైడ్ నోట్ లభించింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని పేర్కొన్నాడు. అటు కిరణ్ కూడా తన తల్లిదండ్రులతో తెగదెంపులు చేసుకుని అఖిలేష్ దగ్గరకు వచ్చేసింది. అప్పటి నుంచి ఇరువురూ తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లోని వారికి దూరమయ్యామనే తీవ్రంగా కలతచెంది ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అఖిలేశ్ తన డెయిరీలో నిన్ను చాలా ఇబ్బంది పెట్టానని తన తల్లి గురించి రాశాడని తెలిపారు.


By January 21, 2021 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-committed-suicide-after-24-hourswife-also-jumped-in-front-of-truck-and-killed/articleshow/80377864.cms

No comments