Breaking News

ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రంగంలోకి దిగిన కమలా.. తొలి ట్వీట్ ఇదే


అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత సంతతి మహిళ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. ఆమె రంగంలోకి దిగారు. ఆమె తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి చేసిన తొలి ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘రెడీ టూ సర్వ్’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా.. ఆమె ట్విట్టర్ ఖాతా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌గా మారింది. ట్విట్టర్‌లో ఆమెకు 15 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలి ప్రసంగంలో కమలా మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజున ఇక్కడ ఉండటానికి కారణం నాకు ముందు వచ్చిన ఓ మహిళ.. నా ఉనికికి కారణమైన నా తల్లి శ్యామల గోపాలన్ హారిస్ మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటారు’ అని తన తల్లి, కుటుంబం గురించి చెప్పారు. 199లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన కమలా.. 2002లో శాన్‌ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తన అసాధారణ ప్రతిభతో అందరి మన్ననలు పొందారు. కాలుష్యాల నివారణకు 2005లో ప్రత్యేకంగా ‘పర్యావరణ నేరాల విభాగా’న్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించారు. ట్రాన్స్‌జెండర్లు వేధింపులకు గురవుతుండడంతో వారికి రక్షణ కోసం ‘హేట్‌ క్రైం’ విభాగాన్ని కూడా నెలకొల్పారు. ఉరిశిక్షలు బదులు యావజ్జీవిత శిక్షలు విధిస్తే మంచిదన్నది కమల అభిమతం.. ఈ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆమె హయాంలోనే చోటు చేసుకుంది. సరైన కారణం లేకుండా 50 రోజుల పాటు స్కూల్‌కు వెళ్లకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు శిక్ష పడింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇలాంటి శిక్షలు పడడం అదే తొలిసారి.


By January 21, 2021 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-vice-president-kamala-harris-first-tweet-says-ready-to-serve/articleshow/80378757.cms

No comments