Breaking News

మై బ్రదర్ జోడీని చూస్తుంటే..! ఉప్పెన టీజర్‌పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సుకుమార్‌ శిష్యుడు, న్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజుల క్రితమే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. లాక్‏డౌన్ ఎఫెక్ట్‏తో వాయిదా పడింది. ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని రిలీజ్ ఆపారు. అయితే ఇటీవల థియేటర్లు రీ ఓపెన్ కావడంతో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ‘ఉప్పెన’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే తాజాగా ఆ అంచనాలకు రెక్కలు కడుతూ ఈ ఉప్పెన టీజర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ''టీజర్ చాలా బాగుంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్'' అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దీంతో మెగా అభిమానుల్లో 'ఉప్పెన' ఉన్న ఆతృత మరింత పెరిగింది. రామ్ చరణ్ మెచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. కాగా ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. సాయిచంద్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కట్టిన ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ పొందడమే గాక యూట్యూబ్‌ని చేస్తున్నాయి.


By January 16, 2021 at 03:00PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-comments-on-vaishnav-tejs-uppena-teaser/articleshow/80301037.cms

No comments