Breaking News

కాకినాడ: దొంగ స్నేహితులు.. జల్సాల కోసం ఇళ్లను దోచేస్తున్నారు


జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు డబ్బు కోసం దొంగలుగా మారారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని అనేక ఇళ్లలో చోరీలు చేస్తూ, దోచుకున్న సొత్తును తాకట్టు పెట్టి ఆ సొమ్ములతో జల్సాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ దొంగ ఫ్రెండ్స్‌ని జైలుకు పంపారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా రాత్రిపూట ఇంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ ఆదేశాలతో ఇన్‌చార్జ్‌ క్రైం డీఎస్పీ ఎస్‌ మురళీమోహన్‌ పర్యవేక్షణలో రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, క్రైం సీఐలు డి గోవిందరావు, కె నాగమోహన్‌రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాకినాడ మెయిన్‌ రోడ్డులోని గోల్డ్‌మార్కెట్‌ సెంటర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. Also Read: వీరిని కాకినాడ డెయిరీఫారం సెంటర్‌కు చెందిన చుక్కల మహేష్‌(32), రుస్తుంఖాన్‌(35)గా గుర్తించిన పోలీసులు నగరంలో జరిగిన అనేక దొంగతనాల్లో వీరి హస్తం ఉన్నట్లు గుర్తించారు. మహేష్‌ గతంలో టీవీ మెకానిక్‌గా, రుస్తుంఖాన్‌ పెయింటర్‌గా పనిచేసేవారని పోలీసులు తెలిపారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి చెడు వ్యసనాలకు బానిసయ్యారని, దొంగతనాలకు పాల్పడుతూ ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారని వెల్లడించారు. వీరిద్దరూ 2019 నుంచి ఇంద్రపాలెం, సర్పవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 15 ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 553 గ్రాముల బంగారు ఆభరణాలు, 1628 గ్రాముల వెండి వస్తువులు, 4 స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.


By January 09, 2021 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-thiefs-arrested-in-kakinada-city-35-lakhs-property-recovery/articleshow/80185363.cms

No comments