Breaking News

అనుమానపు భర్త వేధింపులు.. తెల్లవారుజామున వివాహిత అఘాయిత్యం


అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో పాటు పరాయి వ్యక్తులతో సంబంధాలు అంటగడుతూ భర్త పెడుతున్న నరకాన్ని భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన రోజా(28)కి వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామానికి చెందిన నీరటి రాజ్‌కుమార్‌తో 2016లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం చెల్పూరుకు వచ్చారు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. పుట్టింటికి ఫోన్ కూడా చేసుకోనీయకుండా నిర్బంధం పెట్టాడు. వీటన్నింటినీ భరిస్తూ వస్తున్న భార్యపై ఇటీవల అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితో మాట్లాడినా, కాసేపు కనిపించకపోయినా అనుమానపడుతూ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో భరించలేకపోయిన రోజూ బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి.. గురువారం తెల్లవారుజామున ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు వేయడంతో భర్త రాజ్‌కుమార్‌, స్థానికులు నిద్రలేచి చూసేసరికే ప్రాణాలు కోల్పోయింది. భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ సాయిరమణతో పాటు ట్రైనింగ్ ఐపీఎస్ సుధీర్ రామ్‌నాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ మాధవి సమక్షంలో శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


By January 01, 2021 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-set-ablaze-in-telangana-over-husband-harassment/articleshow/80055847.cms

No comments