Breaking News

సరదా కోసం అలాంటి పనులు వద్దు.. మార్పు మన నుంచే మొదలు కావాలి.. యాంకర్ రష్మీ ఎమోషనల్


యాంక‌ర్ ర‌ష్మికి మూగ జీవాలంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూగ జీవాల‌ పట్ల ఆమె చూపే జాలి, వాటిని హాని జరిగితే ఆమె చెందే ఆవేదన గురించి మనందరికీ తెలుసు. నోరులేని జీవాలను రక్షించండి, దయచేసి వాటిని హాని తపట్టకండి అని ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించింది రష్మీ. లాక్‌డౌన్ వేళ వీధి కుక్కలకు ఆహారం పెట్టి అందరిచేత భేష్ అనిపించించుకున్న ఆమె.. జంతువులపై ప్రేమ చూపించాలంటూ గొప్ప అవేర్‌నెస్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఏనుగు ఫొటో‌ను షేర్ చేస్తూ మన సరదా కోసం ఏనుగులను హింసించ‌డం స‌రికాద‌ని చెప్పింది. మ‌నం స‌ర‌దా కోసం ఏనుగుపై ఎక్కి దానిపై తిర‌గ‌డం వ‌ల్ల దానికి హాని చేసిన వాళ్ళం అవుతున్నామని, దయచేసి అలాంటి సరదాలకు దూరంగా ఉండి వాటిని బాధ పెట్టకుండా ఉండండి అని రష్మీ పేర్కొంది. ''టూరిస్ట్ రైడ్స్‌లో మూగ జీవులపై ప్రయాణాలకు నో చెప్పండి. స‌ర్స‌స్‌కి నో చెప్పండి'' అని ఆమె పోస్ట్ పెట్టింది. ఈ మేరకు గాయపడిన ఏనుగు ఫొటోను చూపిస్తూ.. మనం ఏనుగుపై ఎక్కి తిర‌గ‌డం వ‌ల్ల దానికి ఎలాంటి గాయాల‌వుతాయ‌న్నాయనేది వివరించింది. త‌న మాట విన‌డానికి మావ‌టివాడు ఏనుగును ఇలా గాయ‌ప‌ర్చుతాడ‌ని, కాబట్టి మన సరదా కోసం ఏనుగు ఎక్కడం మానుకోవాలని తెలుపుతూ ఎమోషనల్ అయింది రష్మీ. ఈ సమాజంలో మ‌నం కోరుకునే మార్పు మ‌న నుంచే మొదలు కావాలని ఆమె పేర్కొంది. ఈ పోస్ట్ చూసిన నెటిజ‌న్లు, జంతు ప్రేమికులు పాజిటివ్‌గా స్పందిస్తూ రష్మీ గ్రేట్, నీ లాంటి వాళ్లు ఇలా అవగాహన కల్పించడం మూగ జీవాల సంరక్షణలో ఎంతో ముఖ్యం అని కామెంట్స్ చేస్తున్నారు.


By January 07, 2021 at 10:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmi-gautam-says-no-to-animals-riding-with-her-post/articleshow/80147103.cms

No comments