అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించండి..కొత్త స్ట్రెయిన్పై రాష్ట్రాలకు కేంద్రం సూచన
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు క్రమంగా నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కొత్త స్ట్రెయిన్ను అడ్డుకొనే చర్యల్లో భాగంగా అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించుకోవచ్చని సూచించింది. ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధించుకోవచ్చని, మార్కెట్లు నిర్దేశిత సమయం పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ⍟ బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా వేయవచ్చు. ⍟ విద్యా, సాంస్కృతిక, మత సంబంధ కార్యక్రమాలు, సమావేశాలలో గరిష్ఠంగా 50% మందిని లేదా 200 మందికి మించకుండా అనుమతించాలి. పరిస్థితికి అనుగుణంగా 100 మంది, అంతకంటే తక్కువ మందికే పరిమితం చేయొచ్చు. ⍟ మార్కెట్లలో గుంపులుగా చేరకుండా నిర్దేశిత విధానాలు అమలు చేయాలి. ⍟ విమానాలు, రైళ్లతోపాటు బస్సులు, పడవలు తదితర ప్రజా రవాణా విషయంలోనూ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. కంటెయిన్మెంట్ జోన్లను గుర్తించడంతోపాటు అక్కడికి నిత్యావసరాలను మాత్రమే అనుమతించాలి. ⍟ కొవిడ్ ఆంక్షలు జనవరి 31 వరకూ అమల్లో ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ సన్నద్ధతకు దేశమంతటా డ్రై రన్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లు, ప్రణాళికను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలు, వ్యాక్సిన్ రవాణా విషయంలో అవాంతరాలను గుర్తించడంతోపాటు.. క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి జనవరి 2న డ్రై రన్ను నిర్వహిస్తున్నారు.
By January 01, 2021 at 08:16AM
No comments