Breaking News

హైదరాబాద్‌ వ్యాపారికి రూ.8కోట్ల టోకరా.. గోవాలో పట్టుబడిన కిలేడీ


బ్యాంకులో తనఖా ఉన్న భూమిని విడిపించిన వ్యక్తిని రూ.8కోట్ల మేర మోసం చేసిన మహిళను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. రాజ్‌భవన్‌ రోడ్డులోని సేతి టవర్స్‌కు చెందిన పి.విజయ్‌రాజు వ్యాపారి. 2013లో వసంతనగర్‌కు చెందిన శ్రీనివాసరాజు, కేపీహెచ్‌బీకి చెందిన సామల పద్మజ, ఆమె భర్త సామల నర్సిరెడ్డి, సోదరి విజయలక్ష్మి, సురేష్‌ బాబులు ఆయన వద్దకు వచ్చారు. గోపన్‌పల్లిలో 6.20 ఎకరాల స్థలం ఉందని అందులో విల్లాల నిర్మాణం చేపడతామని చెప్పారు. అయితే ఆ స్థలంపై బ్యాంకులో ఉన్న రుణం చెల్లిస్తే అందులో 2.5 ఎకరాలు ఇస్తామని చెప్పారు. Also Read: దీంతో విజయ్‌రాజు బ్యాంకుకు రూ. 5కోట్లు చెల్లించి మరో రూ. 3కోట్లు విల్లాల నిర్మాణం కోసం స్థల యజమానులకు పెట్టుబడిగా ఇచ్చారు. ఎన్నిరోజులు గడుస్తున్నా అక్కడ అనుమతులు రాకపోవడంతో విల్లాల నిర్మాణం చేపట్టలేదు. తన డబ్బు లేదా ఒప్పందం ప్రకారం భూమి ఇవ్వాలని విజయ్‌ అడిగినా వారు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన విజయ్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న నిందితులు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు సామల పద్మజ గోవాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో ప్రత్యేక బృందం గోవాకు వెళ్లి పద్మజను అదుపులోకి తీసుకుంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఎస్‌ఐ శివకృష్ణ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


By January 06, 2021 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-arrested-in-goa-for-cheated-investor-over-rs-8-crore-in-hyderabad/articleshow/80126554.cms

No comments