Breaking News

గ్రిడ్ వైఫల్యంతో అంధకారంలో పాక్.. రాత్రంతా చిమ్మచీకట్లోనే 21 కోట్ల మంది


ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లో విద్యుత్తు తీవ్ర సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, అన్ని ప్రధాన నగరాలతో సహా దేశంలోని చాలా భాగంలో అంధకారం అలముకుందని అధికారులు తెలిపారు. 21 కోట్ల మందికిపైగా జనాభా ఉన్న దేశంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ సంక్లిష్టమైన.. సున్నితమైన అంశం.. గ్రిడ్ ఓ విభాగంలోని వైఫల్యం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయానికి దారితీస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11.41 గంటల ప్రాంతంలో దక్షిణ పాకిస్థాన్‌లోని లోపం తాజా వైఫల్యానికి కారణమని విద్యుత్ మంత్రి ఒమర్ ఆయూబ్ ఖాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అక్కడ జరిగిన లోపం వల్ల దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలి, పవర్ ప్లాంట్స్ మూసివేతకు కారణమయ్యిందన్నారు. రాజధాని ఇస్లామాబాద్, ఆర్ధిక నగరం కరాచీ, లాహోర్ సహా ప్రధాన నగరాలు అంధకారంలో వెళ్లిపోయాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించామని, మిగతా చోట్ల పునరుద్దరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో అంతర్జాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ కనెక్టివిటీ 62 శాతంగా ఉందని తెలిపింది. 2015లోనూ గ్రిడ్ వైఫల్యంతో 80 శాతం దేశం అంధకారంలోకి వెళ్లింది. పాకిస్థాన్ చరిత్రలో అతిపెద్ద విద్యుత్ వైఫల్యం అదే కావడం గమనార్హం. రాజధాని ఇస్లామాబాద్ సహా దేశవ్యాప్తంగా పెద్ద నగరాలతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలను తీవ్ర ప్రభావితం చేసింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో ట్విట్టర్ #blackout హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తెల్లవారుజామున 2.18 గంటలకు 52,800 ట్వీట్లు చేశారు. ‘చివరకు పాకిస్థాన్ మంచి విషయంలో ఐక్యతను చూపించింది. 2021 గేమ్ బలంగా ఉంది’ అని ఓ ట్విట్టర్ యూజర్ చెప్పారు. ‘చివరకు ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్థాన్‌ను నైట్ మోడ్‌లో పరిచయం చేశారు’ అని ఒకరు.. ‘ట్విట్టర్‌లో పాకిస్థాన్‌లోని ప్రతి ఒక్కరూ ఉదయం వరకు ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఉంటారు’ ఇంకొకరు ట్వీట్ చేశారు.


By January 10, 2021 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/massive-blackout-in-pakistan-after-national-power-grid-breakdown/articleshow/80196478.cms

No comments