Breaking News

ఆన్‌లైన్ ‌లోన్ స్కామ్‌... రూ.21వేల కోట్లు కొల్లగొట్టిన చైనా ముఠా.. వెలుగులోకి సంచలన నిజాలు


ఆన్‌లైన్ లోన్ యాప్‌ల కుంభకోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఢిల్లీలో అరెస్టయిన చైనా దేశస్థుడు ల్యాంబో, అతడి సహాయకుడు నాగరాజుల నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. 2020 జనవరిలో చైనా నుంచి భారత్‌కు వచ్చిన జెన్నీఫర్‌ అలియాస్‌ యాన్‌యాన్‌ దిల్లీలో ఉంటున్న కొందరు చైనీయులతో సంప్రదించి రుణాల యాప్‌ల కంపెనీలను ప్రారంభించారు. చట్టపరంగా దొరక్కుండా భారతీయుల పేర్లతో కంపెనీలు ప్రారంభించారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. యాప్‌ల ద్వారా రూ.లక్షల్లో రుణాలు పంపిణీ చేస్తున్న సమయంలోనే జెన్నీఫర్‌ ఇండోనేషియాకు వెళ్లిపోయింది. అక్కడి నుంచే ఆమె తన కార్యకలాపాలను పర్యవేక్షిస్తోందని పోలీసులు గుర్తించారు. Also Read: ల్యూఫాంగ్‌, నాబ్లూమ్‌, ఫిన్‌ప్రింట్‌, హార్ట్‌వింగ్‌ పేర్లతో నాలుగు కంపెనీలను ప్రారంభించిన జెన్నీఫర్‌.. వాటిని నిర్వహణ కోసం చైనా నుంచి ల్యాంబోను రప్పించింది. ఓ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా ఎంతమందికి రుణాలిచ్చారు? ఎంతమంది ద్వారా డబ్బు వసూలయ్యాయి? అన్న వివరాలను ల్యాంబో.. జెన్నీఫర్‌కు పంపించేవాడు. కీలకమైన సమాచారాన్ని వాట్సాప్‌, హ్యాంగ్‌ అవుట్‌ ద్వారా ఇద్దరూ షేర్ చేసుకునేవారు. తాము రూ.కోట్లలో రుణాలిస్తామంటూ బ్యాంకులకు పత్రాలు చూపించి పదిచోట్ల కరెంట్‌ ఖాతాలను ప్రారంభించారు. ఒక్కో అకౌంట్‌ నుంచి రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ లావాదేవీలు జరిపేలా అనుమతులు తీసుకున్నారు. కర్నూలుకు చెందిన నాగరాజు ఎంబీఏ పూర్తి చేశాక గతేడాది అక్టోబరు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మార్చిలో ఆగ్లో టెక్నాలజీస్‌లో ఉద్యోగంలో చేరాడు. నాగరాజుకు యాప్‌ల ద్వారా రుణాల వ్యవహారాన్ని జెన్నీఫర్‌ వివరించి అతడిని దిల్లీకి తీసుకెళ్లింది. అతడి పేరుతో దిల్లీ, నోయిడా, గుడ్‌గావ్‌లలోని ఐసీఐసీఐ బ్యాంకుల్లో పది ఆన్‌లైన్‌ ఖాతాలను తెరిచింది. మార్చి తొలివారంలో నాగరాజును లాంబోకు అప్పగించింది. అప్పటి నుంచి లాంబో, నాగరాజులు రుణాల యాప్‌ల జమా, ఖర్చులు చూసుకుంటున్నారు. కొద్దిరోజులకే నాగరాజుకు రూ.లక్షల్లో జీతం, సొంత కారు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రుణాల మంజూరు, వసూలు బాధ్యతలను నాగరాజుకు అప్పగించారు. ఈ ముఠా ఆన్‌లైన్ రుణాల పేరుతో ఇప్పటివరకు ఏకంగా రూ.21వేల కోట్లు కొల్లగొట్టినట్లు సైబర్‌ క్రైమ్ పోలీసులు తేల్చారు. దీంతో ఈ చైనా కంపెనీల పుట్టు పూర్వోత్తరాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. రుణాలిచ్చేందుకు జెన్నిఫరల్ ఆర్థిక స్థోమత ఏంటి? వెనుక ఎవరున్నారు? అని ఆరా తీస్తున్నట్లు సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.


By January 01, 2021 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/loan-apps-scam-hyderabad-police-doing-under-investigation-for-chinese-loan-mafia/articleshow/80057454.cms

No comments