Breaking News

వధువు నిర్వాకం, పెళ్లయిన 18 రోజులకే అందరి కళ్లుగప్పి ప్రియుడితో అలా..


ఆమె ఓ యువకుడిని ప్రాణంగా ప్రేమించింది. పెద్దలేమో అతడి మరిచిపోవాలని బెదిరించి మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. మెడలో తాళిబొట్టు పడినా ఆమె మనసులో ప్రియుడి జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోలేదు. దీంతో పెళ్లయిన కొద్దిరోజులకే భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూర్తి రైక్వార్‌(20) అనే యువతి కొంతకాలంగా భజ్జు యాదవ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసి బ్రతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఈలోగా తల్లిదండ్రులు యువతికి మరో వ్యక్తితో డిసెంబర్ 6న వివాహం జరిపించారు. ఇటు ప్రియుడిని వదులుకోలేక, అటు తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేక ఆమె అయిష్టంగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత 24వ తేదీన ఆమె మెట్టినింటికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆమె అందరి కళ్లుగప్పి పారిపోయింది. అదే సమయంలో ఆమె ప్రియుడు కూడా కనిపించకుండా పోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయినట్లు కుటుంబసభ్యులు నిర్ధారించుకున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వధువు రూ.5లక్షల విలువైన బంగారు నగలతో పాటు భారీగా డబ్బు తీసుకుని ప్రియుడితో వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తన భార్య ఎన్ని రోజులైనా కాపురానికి రాకపోవడంతో అనుమానం వచ్చిన పెళ్లికొడుకు అత్తారింటికి రాగా అసలు విషయం తెలిసి షాకయ్యాడు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వధువు, ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు.


By January 14, 2021 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-bride-runs-away-with-lover-takes-along-jewellery-worth-lakhs/articleshow/80263380.cms

No comments