Breaking News

యూపీలో రోడ్డు ప్రమాదం: ధ్వంసమైన రెండు వాహనాలు.. 10 మంది మృతి


ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. మరో పది మంది వరకు గాయపడ్డారు. ఆగ్రా-మొరాదాబాద్ జాతీయ రహదారిపై మినీ బస్సు- ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుండార్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. క్షతగ్రాతులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముందు వెళుతోన్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రోడ్డుపై మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీనియర్ ఎస్పీ మాట్లాడుతూ.. సహాయక చర్యలు దాదాపు పూర్తికావచ్చాయని తెలిపారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించామని, మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి.. ప్రత్యక్షసాక్షుల ప్రకారం ఓవర్‌టేక్ వల్లే ప్రమాదం జరిగింది అన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని వివరించారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతేకాదు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని, అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.


By January 30, 2021 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/more-than-10-died-around-10-injured-in-moradabad-road-accident-in-up/articleshow/80597338.cms

No comments