Breaking News

ఫైజర్ బాటలో మరో సంస్థ.. దేశంలో టీకా అత్యవసర వినియోగానికి దరఖాస్తు


దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఫైజర్ ఇండియా దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆఫ్ ఇండియా సైతం డీసీజీఐకి దరఖాస్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా ప్రయోగాలు భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన సీరమ్.. కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగానికి ధరఖాస్తు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘కోవిషీల్డ్ సురక్షితమైంది.. కోవిడ్ సమర్ధవంతంగా నిరోధించగలదు.. మహమ్మారి నివారణకు దీనిని ఉపయోగించవచ్చు.. దీని ముప్పు కూడా తక్కువ... ఈ ప్రయోజనం విస్తృత ఉపయోగానికి బలంగా మద్దతు ఇస్తుంది’ అని సీరమ్ తన దరఖాస్తులో పేర్కొన్నట్టు పీటీఐతో విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. మరోవైపు, బ్రిటన్, బ్రెజిల్ సహా భారత్‌లో కోవిషీల్డ్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న చెన్నై వాలంటీర్.. తనకు దుష్ప్రభావం చూపిందని ఆరోపణలు చేసిన తర్వాత దీనిపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ట్రయల్స్ నిలిపివేయడానికి ఎటువంటి కారణాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. టీకా సురక్షితమైందని సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా సైతం ఉద్ఘాటించారు. డేటా అండ్ సేఫ్టీ మోనిటరింగ్ బోర్డ్, ఎథిక్స్ కమిటీ కూడా ఫిర్యాదును పరిశీలించిన తరువాత ట్రయల్స్‌ను స్వతంత్రంగా క్లియర్ చేశాయి. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి ఆస్ట్రాజెన్‌కా అభివృద్ధి చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై గందరగోళం నెలకున్న విషయం తెలిసిందే. ఒక్క డోస్ తీసుకున్న వ్యక్తుల్లో 90 శాతం, రెండు డోస్‌లు తీసుకున్నవారిలో 62 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు క్లినికల్ ట్రయల్స్ డేటాలో పేర్కొంది. దీనిపై నిపుణుల నుంచి విమర్శలు రావడంతో తయారీలో లోపం జరిగినట్టు ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆస్ట్రాజెన్‌కా సీఈఓ పాస్కల్ సోరియట్ ప్రకటించారు.


By December 07, 2020 at 12:18PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-pfizer-serum-institute-seeks-approval-for-oxford-covid-vaccine-says-sources/articleshow/79603618.cms

No comments