Breaking News

సాఫ్ట్‌వేర్ అల్లుడని భారీ కట్నమిచ్చి పెళ్లి చేస్తే.. రెండేళ్లకే ఘోరం.. కాకినాడలో దారుణం


కాకినాడలో దారుణ ఘటన వెలుగుచూసింది. వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతమని చెప్పి భారీగా కట్నం తీసుకున్న అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇంట్లో ఖాళీగా ఉంటున్న భర్త కట్నం తేవాలంటూ నిత్యం హింసించాడు. చివరికి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రాజా నగరం మండలం దివాన్ చెరువుకి చెందిన గోవిందరాజుకి ఒక్కగానొక్క కూతురు రమ్యశ్రీ(24) సంతానం. రమ్యశ్రీని పల్లంరాజు నగర్ పవన్ గార్డెన్స్‌కి చెందిన మందాల వెంకటేష్‌కిచ్చి 2018లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, నెలకు లక్షల్లో జీతమని భారీగానే కట్నకానుకలు, బంగారం ముట్టజెప్పారు. ఏకైక కూతురు కావడంతో ఆమె సంతోషంగా ఉండాలని అప్పులు చేసి మరీ వరకట్నం అందించారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన రమ్యశ్రీకి పెళ్లైన కొద్దిరోజులకే వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి తీసుకెళ్లారు. కట్నం తీసుకురాలేదని కోపంగా ఉన్న అత్తింటివారు ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు సుముఖత చూపలేదు. ఎలాగో నచ్చజెప్పి ఆమెను కాపురానికి పంపించారు. అది నచ్చని అత్తమామలు గుంటూరులోని చిన్నకొడుకు ఇంటికి వెళ్లిపోయారు. ఇటీవల చిన్నారి పుట్టినరోజుకి వచ్చి మళ్లీ అక్కడికే వెళ్లారు. అయితే ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఖాళీగానే ఉంటున్న భర్త కట్నం తేవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అక్కడే ఉంటున్న అతని పిన్ని, బాబాయ్‌ కూడా తోడయ్యారు. Also Read: వేధింపులతో విసిగిపోయిన రమ్యశ్రీ అనూహ్యంగా సోమవారం ఉదయం శవమై కనిపించింది. ఆమె భర్త, చిన్నమామ కుటుంబం వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న రమ్యశ్రీ తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేందు పిరికిది కాదని, అత్తింటి వారే ఆమెను కొట్టి చంపేసి ఆత్మహత్యాగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. Read Also:


By December 15, 2020 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-mysterious-death-in-kakinada/articleshow/79735508.cms

No comments