బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలు అక్షత మూర్తి.. ఆమె ఆస్తి ఎన్ని వేల కోట్లంటే?
యూకే ప్రభుత్వ కోశాధికారి, ఎంపీ రిషి సునక్ ఆస్తుల వివరాలపై ఆ దేశ పత్రిక గార్డియన్ విమర్శనాత్మక కథనం ప్రచురించింది. క్వీన్ ఎలిజబెత్-2 కంటే సునక్ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షత ధనవంతురాలని పేర్కొంది. ఈ మేరకు తాము నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను గార్డియన్ పత్రిక తాజాగా వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. అక్షతమూర్తి ఆస్తులు 480 మిలియన్ పౌండ్లు (రూ. 4200కోట్ల)పై మాటే ఉంటాయని, రాణి ఎలిజబెత్ ఆస్తి విలువ 380 మిలియన్ పౌండ్లు (రూ. 3400 కోట్ల) అని తెలిపింది. Read Also: అక్షత ఆస్తిలో అధిక శాతం ఇన్ఫోసిస్లో వాటాలేనని, అందులో ఆమె వాటా 0.91శాతంగా ఉందని వివరించింది. వీటితోపాటు భారత్లో అమెజాన్తో 900 మిలియన్ పౌండ్లు (రూ. 8926 కోట్ల) విలువైన భాగస్వామ్యం ఉంది. బ్రిటన్లోని మరో ఆరు సంస్థల్లోనూ ఆమెకు వాటాలున్నాయని పేర్కొంది. అక్షత భర్త రిషి సునక్.. 2015 బ్రిటన్ ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. Read Also: బ్రిటన్ నిబంధనల ప్రకారం.. మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలు ప్రకటించాలి. అయితే, రిషి తన భార్య పేరిట కేవలం కాటమారన్ వెంచర్స్ అనే సంస్థ మాత్రమే ఉందని వెల్లడించారని గార్డియన్ వ్యాఖ్యానించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ మేనేజ్మెంట్ (ఐఎంఎం) పేరుతో భారత్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో రెస్టారెంట్లు ఏర్పాటుచేసినట్టు వివరించింది. ప్రముఖ చెఫ్ జమై ఓలీవర్, అమెరికా సంస్థ వెండేతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. ఈ వ్యాపారాన్ని 2014లో ప్రారంభించారని వ్యాఖ్యానించింది. ఇందులో ఆమెకు 5 శాతం వాటాలున్నట్టు పేర్కొంది. Read Also: భారత్లో లాభాలపై చెల్లించాల్సిన పన్నులను తగ్గించకోవాలని ఐఎంఎం నిర్మాణాన్ని సమీక్షించిన తరువాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ రిఫార్మ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ టాక్సేషన్ బృందం సూచించిందని వివరించింది. ఈ కథనాన్ని అనుసరించి సునక్పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఇన్ఫోసిస్లో నారాయణ మూర్తి కుటుంబానికి దాదాపు 16.8వేల కోట్లు విలువైన వాటాలున్నాయి.
By December 06, 2020 at 09:37AM
No comments