మళ్లీ మేకప్ వేసుకున్న రాజశేఖర్.. యాాదగిరిగుట్టలో కొత్త సినిమా ప్రారంభం
కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న హీరో తిరిగి మొహానికి మేకప్ వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పూలరంగడు, ఆహా నా పెళ్లంట.. చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో రాజశేఖర్తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. Also Read: ఈ షెడ్యూల్ ముగిశాక ఫిబ్రవరి నుంచి వికారాబాద్లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారట. కెరీర్ ముగిసిపోయిందనుకున్న సమయంలో గరుడవేగ, కల్కి.. వంటి విభిన్న సినిమాలతో హిట్లు అందుకున్న రాజశేఖర్ తాజా సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరభద్రం చౌదరి ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో.. లేదో.. చూడాలి మరి.
By December 29, 2020 at 10:48AM
No comments