Breaking News

పదేళ్లుగా 50 మంది చిన్నారులపై ఇంజినీర్ అత్యాచారం.. సహకరించిన భార్య


అభం శుభం తెలియని చిన్నారులపై పదేళ్లుగా ఓ ప్రభుత్వ ఉద్యోగి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన యూపీలో గత నెల వెలుగుచూసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో నిందితుడి భార్యను సోమవారం అరెస్ట్ చేసింది. నిందితుడు రామ్‌భవన్ సింగ్ అకృత్యాలకు అతడి భార్య దుర్గావతి సహకరించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. భర్త తప్పుడు పనిచేస్తుంటే వారించాల్సింది పోయి, అతడికి సహకరించిందని పేర్కొన్నాయి. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సీబీఐ కోర్టు ఆమెకు జనవరి 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇరిగేషన్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిందితుడు రామ్‌భవన్ పదేళ్లుగా 50 మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. పైకి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూ కన్నుపడిన బాలికపై కామవాంఛను తీర్చుకునేవాడు. పదేళ్లుగా దాదాపు 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం చేశాడు. వీరిలో చాలామంది 5 నుంచి 16 ఏళ్లలోపు బాలికలే కావడం గమనార్హం. చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా జిల్లాల్లోని పేద మైనర్‌ బాలికలను టార్గెట్‌గా చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘనకార్యాలను ఫోటోలు, వీడియోలు తీసి వాటిని దేశ, విదేశాల్లోని ఇతరులకు సైతం పంపిచినట్లు దర్యాప్తులో తేలింది. తన కామవాంఛలు తీర్చుకోవడానికి, బయపెట్టకుండా ఉండటానికి బాధితులకు ఖరీదైన ఫోన్లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇచ్చి లోబర్చుకునేవాడు. అయితే గతంలోనే ఈ ప్రబుద్ధుడిపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అతడి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున పోర్న్ సీడీలు, వీడియోలు, మొబైల్‌ ఫోన్స్‌తో పాటు కొంతమంది బాలికల ఫోటోలు సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నివాసంలో రూ.8 లక్షల నగదు, సెక్స్‌టాయ్స్, చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా లభ్యమయ్యాయి. అతడి ఈ-మెయిల్‌ను పరిశీలించగా దేశ, విదేశాల్లోని పలువురికి వీటిని పంపినట్టు గుర్తించారు. దేశంలో చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. జనవరిలో వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతి రోజూ 100 మంది చిన్నారుల సగటున లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతేడాదితో పోల్చితే ఇది 22 శాతం అధికం. ఇక, 2008-2018 మధ్య చిన్నారులపై లైంగిక దాడులు ఆరు రెట్లు పెరిగాయి.


By December 29, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/wife-of-up-engineer-who-abused-50-children-arrested-allegedly-helped-him/articleshow/80004597.cms

No comments