Breaking News

ఆ రోజు నిహారికను చూడగానే మా ఇద్దరిలో కన్నీళ్లు ఆగలేదు.. నాగబాబు సతీమణి పద్మజ భావోద్వేగం


డిసెంబర్ 9వ తేదీన చైతన్యతో మెగా డాటర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు సంప్రదాయం ప్రకారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగిన ఈ వేడుకలో మెగా కుటుంబం చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీంతో ఆయా ఫొటోలు, ముచ్చట్లతో నేటికీ సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక తల్లి, మెగా బ్రదర్ నాగబాబు భార్య ఈ పెళ్లి వేడుక గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రతి తల్లిదండ్రి లాగే తాము కూడా తమ కుమార్తె వివాహం ఘనంగా చేయాలని అనుకున్నామని, దేవుడి కృపతో అన్నీ అనుకున్నట్లే జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని పద్మజ చెప్పారు. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి తనకు బాగా జ్వరం ఉందని.. తన భర్త నాగబాబు, కుమారుడు వరుణ్‌తేజ్‌ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారని ఆమె తెలిపారు. తన ముద్దుల చిన్నారి కుమార్తె నిహారిక ఇప్పుడు వివాహిత అయ్యిందంటే నమ్మలేకపోతున్నామని, ప్రస్తుతం నిహారిక మునుపెన్నడూ లేనంత సంతోషంగా కనిపిస్తోందని ఆమె అన్నారు. Also Read: ''ఇక నిహారికను పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో ఆమె నా నిశ్చితార్థపు చీర కట్టుకోవడం చూసిన ఆ క్షణం నా భర్త, నేను కన్నీళ్లు పెట్టుకున్నాం. అవి ఎన్నటికీ మరవలేని భావోద్వేగభరితమైన క్షణాలు. అలాగే అవే నా జీవితంలో ఎంతో అపురూప విషయాలు'' అని పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా నిహారిక- చైతన్య జోడీ ఎంతో చూడముచ్చటగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌ అని చెబుతూ పొంగిపోయారు పద్మజ. వారిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయని, నిహారిక ఆదర్శవంతమైన జీవితభాగస్వామిని పొందినందుకు చాలా ఆనందపడుతున్నామని ఆమె అన్నారు.


By December 13, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-wife-padmaja-says-about-her-daughter-niharika-marriage-event/articleshow/79703169.cms

No comments