Breaking News

ఈ గ్లామర్‌ బ్యూటీని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా..?


సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ కొట్టిన వాళ్లకు అవకాశాలు వస్తాయి. సినిమా తేడా కొట్టిందో వాళ్ల అడ్రస్ గల్లంతే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది హాట్ బ్యూటీ . ‘కుమారి 21 ఎఫ్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హెబ్బా పటేల్‌‌కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్, నిఖిల్, రామ్ లాంటి యంగ్ హీరోలతో నటించి పర్‌ఫెక్ట్ జోడి అనిపించుకుంది Also Read: ఆ తర్వాత సినిమాల ఎంపికలో ముఖ్యంగా తన పాత్ర విషయంలో ఏమీ ఆలోచించకుండా సినిమాలు చేయడంతో ఆమె కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడే పరిస్థితి నెలకొంది. అరుణ్ ఆదిత్‌తో '24 కిస్సెస్'లో నటించి బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌కి బాగానే కనెక్ట్ అయినా ఆ సినిమా దారుణంగా పరాజయం కావడంతో హెబ్బాను పలకరించేవారే లేకుండా పోయారు. నితిన్ ‘భీష్మ’లో చిన్న క్యారెక్టర్‌లో మెరిసినా అది ఆమె కెరీర్‌కు బూస్టప్ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా చిన్న హీరో అయిన రాజ్‌తరుణ్‌తో వరుస సినిమాలు చేయడం అవి ఫ్లాప్ కావడంతో యంగ్ హీరోలు సైతం ఆమెను కన్నెత్తి చూడటం లేదంట. ఈలోగా కృతి శెట్టి, నేహ శర్మ, కేతిక శర్మ వంటి యంగ్ బ్యూటీస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఇక ఆమెకు హీరోయిన్‌ ఛాన్సులు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఐటెమ్ సాంగ్స్ చేసేందుకు సై అంటోంది. Also Read: రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఐటెమ్ గాళ్‌గా అయినా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. సినిమా ఆఫర్లు రాకపోవడంతో వెబ్ సిరీస్‌లపై అడుగులు వేస్తోంది. నిజానికి హెబ్బా పటేల్‌ అందంగా ఉంటుంది... వాటిని ప్రదర్శించడానికి వెనుకాడదు కూడా. ఎలాంటి పాత్రలకైనా అడ్డు చెప్పదు. కానీ ఇండస్ట్రీలో అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.. అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అదిలేకే చాలామంది కనుమరుగై పోతుంటారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. Also Read:


By December 22, 2020 at 08:54AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/is-tollywood-ignores-heroine-hebah-patel/articleshow/79849935.cms

No comments