Breaking News

పక్కా ప్లాన్.. ప్రియుడ్ని రెచ్చగొట్టి తల్లిదండ్రులను హత్యచేయించిన బాలిక


తమ ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పారనే అక్కసుతో తల్లిదండ్రులను అత్యంత దారుణంగా మైనర్ బాలిక, ఆమె ప్రియుడు కలిసి హత్యచేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కానిస్టేబుల్ దంపతుల హత్య జరిగిన తర్వాత ద్విచక్రవాహనంపై రాజస్థాన్‌కు పారిపోతున్న ప్రేమికులు ఇద్దర్నీ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.లక్ష నగదు, హత్యకు వినియోగించిన కొడవలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 50 మందిని ప్రశ్నించిన పోలీసులు, ఆ ప్రాంతంలోని ఉన్న 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. హత్య తర్వాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఇద్దరూ ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేశారు. అయితే, కొన్ని సెకెన్లు బాలిక ప్రియుడి ఫోన్ ఆన్ చేయడంతో వాళ్లు రాజస్థాన్‌వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. సరిహద్దు జిల్లాల్లోని పోలీసులను అప్రమత్తం చేసిన అధికారులు ఇద్దరూ రాష్ట్రం దాటివెళ్లకుండా నిఘా పెట్టారు. మందసౌర్-నీముచ్ జాతీయ రహదారిపై నిందితులను అరెస్ట్ చేశారు. ఎవరూ తమ ఏకాంతానికి భంగం కలిగించకూడదని రాజస్థాన్‌కు పారిపోవాలని నిర్ణయించుకున్నారని డీఐజీ హరినారాయణ్ చారీ మిశ్రా తెలిపారు. యువకుడితో సంబంధాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారిని హత్యచేయడానికి ప్రియుడిన్ని పురికొల్పిందని అన్నారు. తము స్వేచ్ఛకు అడ్డుపడుతున్నారని, అందుకే వారిని హత్యచేసినట్టు వెల్లడించారు. హత్య తర్వాత బీరువాలో ఉన్న రూ.లక్ష తన వెంట తీసుకెళ్లినట్టు వివరించారు. ప్రియుడ్ని కలవకుండా నిర్బంధించడంతో తల్లిదండ్రులను దారికి తెచ్చుకోవడానికి భారీ పథకం వేశారు. హత్యకు మూడు రోజుల ముందే వ్యూహరచన చేసినట్టు నిందితులు వెల్లడించారు. తొలుత నిద్రమాత్రలు ఇచ్చి హత్యచేయాలని పథకం వేసినా, అది ఫలించలేదు. ఇంటికి సమీపంలో ఉన్న తాతానాన్నమ్మలకు తోడుగా బుధవారం రాత్రి తన సోదరుడు వెళ్తున్నట్టు తెలిసిన బాలిక.. ఈ విషయం తన ప్రియుడికి చేరవేసింది. దీంతో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ప్రియురాలి ఇంటికి యువకుడు వచ్చాడు. అతడి రాకకోసం వేచిచూస్తున్న మైనర్ బాలిక తలుపులు తెరిచి, ఇంటిలో ఉన్న కుక్కను తీసుకుని బయటకు వచ్చింది. ఆ సమయంలో బయటకు రావడం, ఇంట్లో నుంచి అరుపులు వినపడటంతో బాలికను పక్కంటి వ్యక్తికి ఆరతీయగా.. అమ్మానాన్నలు గొడవపడుతున్నారని చెప్పింది. బాలిక బయటకు రావడం ఆమె తాత గమనించినా ఏమీ అడగలేదు. గాఢనిద్రలో ఉన్న కానిస్టేబుల్ భార్యను నిందితుడు తొలుత కత్తితో తల, ముఖంపై ఐదుసార్లు పొడిచాడు. ఆమె అరుపులకు కానిస్టేబుల్ మేల్కొనడంతో అతడిపై దాడిచేసి, బలంగా పొడవడంలో కుప్పకూలిపోయాడు. మైనర్ బాలిక ఏమీ తెలియనట్టు కుక్కును తీసుకొని వచ్చి గేటుకు కట్టింది. మృతదేహాలను బెడ్‌షీట్‌తో కప్పేసి, తన తండ్రిపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖరాసిపెట్టింది. అనంతరం బీరులోని రూ.1.19 లక్షలు తీసుకుని పరారయ్యారు.


By December 19, 2020 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-and-lover-held-for-her-parents-murder-in-indore/articleshow/79810184.cms

No comments