Breaking News

Mohan Lal: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దృశ్యం2’


కథానాయకుడిగా 2013లోమలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోలు రీమేక్‌ చేసి అక్కడా విజయం సాధించారు. తాజాగా ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్‌ ‘’ తెరకెక్కించారు. మోహన్‌లాల్, మీనా జంటగా సెప్టెంబర్ చివర్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. Also Read: చివరి రోజు యూనిట్ సెట్‌లో తీసుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పక్కా ప్లాన్‌తో 43రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని యూని్ తెలిపింది. మరి ఈ సీక్వెల్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి. Also Read:


By November 09, 2020 at 07:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-jeethu-joseph-drishyam-2-shooting-was-completed/articleshow/79120393.cms

No comments